👉 ఎస్పీ అశోక్ కుమార్ !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతల నేపథ్యంలో అక్టోబర్ 1 నుండి 31 వరకు నెల రోజులపాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటించారు.
ఈ యాక్ట్ ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆదేశించారు.
శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా మరియు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్.పి. జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు పోలీసు యంత్రాంగానికి ఈ విషయంలో సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణ కు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.