ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో వసతుల కల్పనకు కృషి చేస్తాం !

👉 కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చౌదరి సుప్రభాత్ రావు !

J.SURENDER KUMAR,

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో పట్టణంలో కెసిఆర్ కాలనీ లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని. ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దుతామని అధికార కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు  చౌదరి సుప్రభాత్ రావు అన్నారు.

గురువారం  కాలనీలో కొత్త కార్యవర్గం ఏర్పడిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదలు నివాసముండే కేసీఆర్ కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంత కాలనీగా మార్చేందుకు కృషి చేస్తామని అన్నారు.
వారం రోజుల్లో సిసి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రతను కాపాడుతూ, కాలనీ శుభ్రతలో భాగస్వామ్యులు కావాలని, చోరీల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ కాలనీ నూతన కార్యవర్గం ఎన్నికలు జరిగాయి.  అధ్యక్షుడిగా డి.జి.శ్రీనివాస శర్మ, గౌరవ అధ్యక్షులుగా బాలమణి, ప్రధాన కార్యదర్శిగా దిడ్డి మల్లేశం, కోశాధికారిగా దేవుని శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా రుద్రోజి స్వామి, కుద్బోద్దిన్, నమండ్ల రమేష్, సంయుక్త కార్యదర్శులుగా సాదుల యాదగిరి, తుజాల శ్రీనివాస్ గౌడ్, చిర్ర సత్యనారాయణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సలహాదారులుగా బసన్నపల్లి మల్లేష్ యాదవ్, ఊడెం దేవరాజు, పటేరి రాము, కర్రే నరేందర్, కార్యవర్గ సభ్యులుగా తుడుం పెంటయ్య, బల్ల యాదగిరి, మెకొండ యాదగిరి, గూగుల రాజేష్ ఎన్నికయ్యారు.


యూత్ కమిటీలో దేవుని ప్రకాష్ అధ్యక్షుడిగా, అరుణ్, సాయి మణి, ఉన్న తేజ, దస్తగిరి, భానుచందర్ ఉపాధ్యక్షులుగా, సచిన్ సాగర్ ప్రధాన కార్యదర్శిగా, ఓంకార్ కోశాధికారిగా, రుతిక్, అప్రోజ్ ఖాన్, అజయ్, సాయి కృష్ణ, జి. రాహుల్ సంయుక్త కార్యదర్శులుగా ఎన్నికయ్యారు.

మహిళ కమిటీలో బండి మంజుల అధ్యక్షురాలిగా, పుట్టి లక్ష్మి, కళావతి, కవిత ఉపాధ్యక్షులుగా, పుట్టి యాదగిరి ప్రధాన కార్యదర్శిగా, దిడ్డి సబిత కోశాధికారిగా, మర్కు సునీత సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు.

నూతనంగా  ఎన్నికైన అధ్యక్షుడు డి జి.శ్రీనివాస శర్మ,  మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సహకారంతో కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. సమావేశంలో కాలనీ ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.