J.SURENDER KUMAR,
20వ జాతీయ ఆర్టీఐ వారోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్లోని నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ ఆర్టీఐ నూతన లోగోను ఆవిష్కరించారు.

ముఖ్యమంత్రి ని కలిసినవారిలో ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి , పీవీ శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్ , దేశాల భూపాల్ , మెర్ల వైష్ణవి ఉన్నారు.