👉 పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు !
👉 రాజన్న ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి !
J.SURENDER KUMAR,
ధర్మ విజయ యాత్రలో భాగంగా శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారికి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు ఆదివారం పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు.

ఈసందర్భంగా రాజన్నకు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోటిలింగాల దర్శనం చేసుకున్నారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి మ్యాప్ ను పరిశీలించారు.

కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కలెక్టర్ ఎం హరిత, ఎస్పీ మహేష్ బి గితే, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, ఆలయ ఈవో రమాదేవి, వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దార్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.