J.SURENDER KUMAR,
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ , తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో శనివారం కలిసిన సందర్భంలో, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రేవంత్ రెడ్డి వివరించారు.

ప్రధానంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల గురించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కు తెలిపారు.
