👉 ధర్మపురికి పోటెత్తిన భక్తజనం !
👉 అంగరంగ వైభవంగా బ్రహ్మ పుష్కరిలో ( కోనేటిలో ) దీపాలంకరణ !
J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం లో బుధవారం అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరిగాయి. గోదావరి నదిలో పుణ్యస్నానాలు కోసం తెల్లవారుజాము నుంచే భక్తజనం క్షేత్రానికి రావడంతో నదితీర ప్రాంతం , ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.





కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం బ్రహ్మ పుష్కరిణిలో దీపాలంకరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యలు కలగకుండా పోలీస్ యంత్రాంగం కృషి చేసింది.
👉 పౌర్ణమి నాటి ఆదాయ వివరాలు !
👉 టికెట్లు ₹ 3,33,915 /-
👉 ప్రసాదాలు ₹ 4,23,800/-
👉 అన్నదానం ₹ 61,303/-
👉 మొత్తం.₹ 8,19,018/-
