👉 నేషనల్ స్పోర్ట్స్ మీట్–2025లో ఘన విజయం సాధించిన తెలంగాణ గిరిజన విద్యార్థులు !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
రూర్కెలాలో జరిగిన క్రీడా పోటీల్లో తెలంగాణ ఏకలవ్య విద్యా సంస్థల విద్యార్థులు సాధించిన 230 పతకాలు గిరిజన యువత ప్రతిభకు జాతీయస్థాయిలో గుర్తింపు అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
నేషనల్ స్పోర్ట్స్ మీట్–2025 లో230 పతకాలతో రాష్ట ప్రతిష్టను ప్రపంచానికి చాటిన తెలంగాణ గిరిజన ఏకలవ్య విద్యాసంస్థల విద్యార్థులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం హైదరాబాద్ సచివాలయంలో ఘనంగా సన్మానించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ
రూర్కెలా–సుందర్గఢలో నవంబర్ 11 నుంచి 15 వరకు జరిగిన 4 వ గిరిజన ఏకలవ్య విద్యాసంస్థల విద్యార్థులు నేషనల్ స్పోర్ట్స్ మీట్–2025లో తెలంగాణ విద్యార్థులు చరిత్ర సృష్టించారు అని మంత్రి అన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య గిరిజన పాఠశాలల మధ్య జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్షిప్, ఓవరాల్ టీం ఛాంపియన్షిప్, ఓవరాల్ ఇండిజువల్ ఛాంపియన్షిప్ ను సొంతం చేసుకుని ఘనవిజయం సాధించడం అభినందనీయం అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న నూతన క్రీడా విధానం, EMRSలలో ప్రపంచ స్థాయి క్రీడా వాతావరణం సృష్టించడంలో ఒక గొప్ప పాత్ర పోషించిందని మంత్రి అన్నారు.
అథ్లెటిక్స్, షూటింగ్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, జూడో, యోగా, స్విమ్మింగ్ వంటి విభాగాల్లో విద్యార్థులు సాధించిన పతకాలు క్రమశిక్షణ, శ్రమ, పట్టుదలకు ప్రతీక అని పేర్కొన్నారు.
దేశంలోనే అత్యుత్తమ క్రీడా సదుపాయాలు, నైపుణ్యం, శిక్షణ అందిస్తున్నదనే దానికి ఈ విజయం నిదర్శనమన్నారు.

ఈవిజయాలు భవిష్యత్తులో మరిన్ని జాతీయ–అంతర్జాతీయ పతకాలకు నాంది పలుకుతాయనీ, గిరిజన విద్యార్థుల క్రీడా ప్రతిభను సహకరిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో TGTWREIS and TGEMRS సెక్రటరీ శ్రీమతి కే. సీతాలక్ష్మి, IAS, మరియు అధికారులు, కోచ్లు, టీచర్లు పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు.
తెలంగాణలోని 23 గిరిజన విద్య సంస్థల నుండి 580 మంది విద్యార్థులు, 68 మంది ఎస్కార్ట్ టీచర్లు పాల్గొన్నారు. షూటింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, జూడో, స్విమ్మింగ్, తైక్వాండో, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, యోగా, బాస్కెట్బాల్, ఖో-ఖో తదితర విభాగాల్లో విశేష ప్రతిభను చాటి మొత్తం 230 పతకాలు సాధించారు.
