👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J SURENDER KUMAR,
డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరవుతున్న ఈ అంతర్జాతీయ సదస్సుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
👉 భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోయే ఈ సదస్సుతో పాటు రాష్ట్రానికి అత్యంత కీలకమైన దార్శనిక పత్రం తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ విడుదల చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ అంశాలపై వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.
👉 ఈ రోజు నుంచి నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ అంశాలపై వరుస సమావేశాలను నిర్వహిస్తూ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, 2047 నాటికి తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన తెలంగాణ రైజింగ్ దార్శనిక పత్రంపై తుదిమెరుగులు దిద్దనున్నారు.
👉 ఈవరుస సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క , మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో పాటు అంశాల వారిగా జరిగే సమీక్షల్లో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు.
☝️ నవంబర్ 25 : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ !
☝️ నవంబర్ 26 : లాజిస్టిక్స్, సమ్మిట్ ఏర్పాట్లు !
☝️ నవంబర్ 27 : మౌలిక వసతులు, అభివృద్ధి (పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, రవాణా, రోడ్లు – భవనాలు, ఆర్థిక, విద్యుత్, గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, మున్సిపల్ వ్యవహారాలు)!
☝️ నవంబర్ 28 : విద్య, యువజన సంక్షేమం, (క్రీడలు, నైపుణ్యత, టూరిజం, దేవాదాయ శాఖ) !
☝️ నవంబర్ 29 : వ్యవసాయం, అనుబంధ విభాగాలు, సంక్షేమం (బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ) !
☝️ నవంబర్ 30 : ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం !
