తెలంగాణలో ప్రాజెక్టులు పెట్టేందుకు విన్‌గ్రూప్ సిద్ధం !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ని విన్‌గ్రూప్ ఏషియా సీఈఓ  ఫామ్ సాన్ చౌ  న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కీలక ప్రాజెక్టులను స్థాపించేందుకు విన్‌గ్రూప్  ముందుకొచ్చింది.

👉 తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్  తయారీ యూనిట్లు, బ్యాటరీ నిల్వ సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్న విన్‌గ్రూప్  ఉద్దేశాన్ని ఈ సందర్భంగా ఫామ్ సాన్ చౌ  తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న సస్టైనబుల్, క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో అవకాశాలను కూడా పరిశీలిస్తామని తెలిపారు.


👉 ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీపై ప్రత్యేక ఆసక్తి చూపిన  ఫామ్ సాన్ చౌ, దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి  ప్రణాళికలను అభినందిస్తూ, ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టేందుకు విన్‌గ్రూప్ సిద్ధంగా ఉందని తెలిపారు.


👉 డిసెంబర్ 8–9 తేదీలలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో విన్‌గ్రూప్ చైర్మన్  ఫామ్ నాట్ వూంగ్ తో కలిసి పాల్గొనవలసిందిగా ఫామ్ సాన్ చౌ ను ముఖ్యమంత్రి  ఆహ్వానించారు.


👉 ఈ సమావేశం తెలంగాణలో గ్లోబల్ పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవడంలో, భవిష్యత్‌కు దిశనిర్ధేశం చేసే గ్రీన్, ఇన్నోవేషన్ ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడంలో ఒక కీలక ముందడుగుగా నిలిచింది.


👉 పరిశ్రమలు & వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, ముఖ్యమంత్రికి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కోఆర్డినేషన్ (కేంద్ర ప్రాజెక్టులు & CSS) సెక్రటరీ గౌరవ్ ఉప్పల్  ఈ సమావేశంలో పాల్గొన్నారు.