తిరుమల తిరుపతి దేవస్థానంకు ₹ 2 కోట్లు  విరాళం !

J.SURENDER KUMAR,

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి హెచ్.సి.ఎల్. టెక్నాలజీస్ చైర్ పర్సన్ శ్రీమతి రోషణి నాడర్ మంగళవారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు ₹ 2 కోట్లు విరాళం అందించారు.

ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్  బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందించారు.