యూపీఎస్సీ మెయిన్స్ విజేతలకు లక్ష రూపాయల అందజేత !

👉 రాజీవ్ సివిల్స్ అభ‌య హ‌స్తం పథకం కింద !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

తెలంగాణ నుంచి యూపీఎస్సీ మెయిన్స్ – 2025 ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు బుధవారం  లక్ష రూపాయల చెక్కులను  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అందించి అభినందనలు తెలిపారు.


👉  సివిల్స్​ సాధించాలన్న లక్ష్యంతో పరీక్షలకు సిద్ధమయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం గ‌త ఏడాది రాజీవ్ సివిల్స్ అభ‌య హ‌స్తం పథకాన్ని ప్రారంభించి అభ్యర్థులకు నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది.


👉 అందులో భాగంగా ఈ ఏడాది కూడా సింగరేణి సంస్థ అధ్వర్యంలో 202 మందికి ₹1 ల‌క్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించింది. తాజాగా యూపీఎస్సీ ప్రకటించిన మెయిన్స్ ఫలితాల్లో రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 43 మంది విజేతలుగా నిలిచారు.


👉  మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు గ‌తేడాది మాదిరిగా ఈసారి కూడా ఇంట‌ర్వ్యూల‌కు స‌న్న‌ద్ధం అయ్యేందుకు మ‌రో ల‌క్ష రూపాయ‌ల చొప్పున ప్రోత్సాహ‌కం అందించ‌నున్నారు.