J.SURENDER KUMAR,
క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక మిషన్ కాంపౌండ్ కమ్యూనిటీ హాల్లో ఎవాంజెలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఏర్పాటు చేసిన జగిత్యాల నియోజకవర్గ క్రిస్మస్ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ , జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ , జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గాజంగి నందయ్యతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

అన్ని మతాలను సమానంగా గౌరవించే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు క్రైస్తవ సోదర సోదరీమణులకు మంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

క్రైస్తవ మైనారిటీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, రానున్న రోజుల్లో మరింత సహకారం అందిస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, క్రైస్తవ సంఘ నాయకులు, పాస్టర్లు, పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు.
