J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం మండలం సిరికొండ గ్రామ ఇండిపెండెంట్ సర్పంచ్ గా ఎన్నికైన ధర్మరాజు, గ్రామస్తులు, యువకుల తో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సర్పంచుకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజల నమ్మకంతో గెలిచిన సర్పంచ్ ధర్మరాజు కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షణీయమని మంత్రి అన్నారు.

సిరికొండ గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొని గ్రామాభివృద్ధికి తోడ్పడాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.
