పతాక దినోత్సవ నిధికి సీఎం రేవంత్ రెడ్డి విరాళం!

J.SURENDER KUMAR,

సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి  కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ₹1 లక్ష రూపాయల విరాళం అందించారు. సాయుధ దళాల పతాక దినోత్సవం (డిసెంబర్ 7) పురస్కరించుకుని తెలంగాణ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టరేట్ ప్రతినిధులు ముఖ్యమంత్రి ని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా బోల్డ్ అండ్ బ్రేవ్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సైనిక్ వెల్ఫేర్  డైరెక్టర్ కల్నల్ రమేష్ కుమార్, కెప్టెన్ శ్రీనేష్ కుమార్ , కెప్టెన్ నరోత్తమ్ రెడ్డి , కెప్టెన్ శ్రీనివాసులు తో పాటు ఇతర అధికారులు ఉన్నారు.