J.SURENDER KUMAR,
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నెలలో జరగనున్న క్రీడా పోటీలకు సంబంధించి చీఫ్ మినిస్టర్స్ కప్ 2వ ఎడిషన్ -2025 పోస్టర్ ను ముఖ్యమంత్రి బుధవారం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ క్రీడాపోటీలకు సంబంధించి అవగాహన కల్పించడానికి ఈ నెల 8 వ తేదీ నుంచి 17 వరకు పది రోజుల వరకు టార్చ్ ర్యాలీ కొనసాగనుంది.
👉 ఈ నెల 17 వ తేదీ నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31 వ తేదీ వరకు వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7 తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26 వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరగనున్నాయి. డిసెంబర్ నెలలో జరగాల్సిన ఈ క్రీడలు వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి.
👉 గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ స్థాయిల్లో మొత్తం 44 రకాల క్రీడల్లో శాట్స్ పోటీలను నిర్వహించనుంది. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి , శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి , స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ , సిఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు , SATG ఎండీ సోనీబాల పాల్గొన్నారు.
