ఫ్లాష్. ఎమ్మెల్సీ కవిత కన్నీటి ఆవేదన !

👉 నాది ఆస్తుల పోరాటం కాదు ఆత్మగౌరవ పోరాటం ఎమ్మెల్సీ కవిత !

👉 మా ఇంటి దైవం లక్ష్మి నరసింహ స్వామి సాక్షిగా, నా ఇద్దరు కొడుకుల మీద ప్రమాణం చేస్తున్నాను !

J SURENDER KUMAR,

తెలంగాణ శాసనమండలి సాక్షిగా మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కన్నీటి ఆవేదన వ్యక్తం చేస్తూ అత్యంత భావోద్వేగ పూరిత ప్రసంగం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇతరులు ఆరోపించినట్లు నా పోరాటం ఆస్తుల కోసం కాదు ఆత్మ గౌరవం కోసం నా పోరాటం అని మా ఇంటి దైవం శ్రీ లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా, నా ఇద్దరి కొడుకుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను అంటూ సోమవారం శాసనమండలిలోఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. 

తన రాజకీయ ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లను వివరిస్తూ ఆమె సభలోనే కంటతడి పెట్టుకున్నారు. అనంతరం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ప్రసంగం సందర్భంగా కవిత మాట్లాడుతూ.. “కేసీఆర్‌, ప్రొఫెసర్ జయశంకర్‌  స్ఫూర్తితోనే నేను ఉద్యమంలోకి వచ్చాను. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే నాపై అనేక ఆంక్షలు మొదలయ్యాయి. పార్టీలో నా గొంతును వినిపించినప్పుడు, ప్రశ్నించినప్పుడు నాపై కక్ష గట్టారు.

సొంత పార్టీ బీఆర్‌ఎస్‌ నుంచి కూడా నేను అనేక కట్టుబాట్లు, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


ధర్నా చౌక్ ఎత్తివేతను వ్యతిరేకించాను, టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చడాన్ని వ్యతిరేకించాను,  కాంట్రాక్టు ఉద్యోగుల గురించి ప్రశ్నించాను, అనామాకులు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్టు పనులు పొంది లక్షల కోట్లకు అధిపతి అయ్యారు,

గతేడాదే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని గుర్తు చేసిన కవిత, తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి ఛైర్మన్‌ను కోరారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన బీఆర్‌ఎస్‌ పార్టీకి, నిజామాబాద్‌ జిల్లా ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.