ధర్మపురిలో నేటి నుంచి భాగవత సప్తాహం !

👉 బ్రహ్మశ్రీ  సామవేదం షణ్ముఖ శర్మ గారిచే..

J SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లోని బ్రాహ్మణ సంఘం భవన ప్రాంగణంలో నేటి నుంచి ( గురువారం) బ్రహ్మశ్రీ  సామవేదం షణ్ముఖ శర్మ  భాగవత సప్తాహం ఆరంభం కానున్నది. బ్రహ్మశ్రీ కశోజ్జల  రాజన్న శాస్త్రి,వెంకవాయమ్మ  జ్యేష్ట పుత్రుడు,కషోజ్జల శివరామ్ స్మృత్యర్థం. భాగవసప్తహ కార్యక్రమం వారి కుటుంబ సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

బ్రహ్మశ్రీ  సామవేదం షణ్ముఖ శర్మ సాయంత్రం  ధర్మపురి క్షేత్రానికి రానున్నారు. కార్యక్రమం ప్రతిరోజు ఉదయం  09.30  నుంచి 12.00 మధ్యాహ్నం వరకూ భాగవత సప్తాహ ప్రవచన కార్యక్రమం  కొనసాగుతుంది.

ప్రతిరోజు  బ్రాహ్మణ భోజనం కొనసాగనున్నది భోజన ప్రసాదం కి అందరూ ఆహ్వానితులే అని కశోజ్జల చంద్రమౌళి కష్జోల వారి కుటుంబ సభ్యులు తెలిపారు.