ధర్మపురి మున్సిపాలిటీ స్వీప్ చేసిన కాంగ్రెస్ !

👉 ఖాతా తెరవని కారు ,కమలం పార్టీ లు !

👉 చాలెంజ్ చేసి స్వీప్ చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్!

J.SURENDER KUMAR,

మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి మున్సిపల్ ను కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. 15 కౌన్సిలర్ స్థానాలకు 15 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయ దుందుభి మోగించారు. టిఆర్ఎస్ (కారు) పార్టీ, బిజెపి ( కమలం )పార్టీ
ఖాతా తెరవలేదు.

👉 ఛాలెంజ్ చేసి…

ధర్మపురి మున్సిపాలిటీలో 15 కౌన్సిలర్ స్థానాలకు 15 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రచార సభలలో ఛాలెంజ్ చేసి కైవసం చేసుకున్నారు.

👉 గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు:

👉 1  వార్డ్ – అయ్యోరి వేణుగోపాల్(కాంగ్రెస్)

👉 2  వార్డు సంగనభట్ల సంతోషి ( కాంగ్రెస్)


👉 3  వార్డు ఇందారపు రామయ్య ( కాంగ్రెస్)

👉  4  వార్డ్ – కొమురెల్లి పవన్(కాంగ్రెస్)

👉 5  వార్డు వేముల  నాగలక్ష్మి (కాంగ్రెస్)

👉 6  వార్డు ముడుసుల ప్రశాంత్ (కాంగ్రెస్)

👉 7  వార్డ్ –  వంకుదోత్ విజయ్  బాబు(కాంగ్రెస్)

👉 8  వార్డు జంజిరికాని సువర్ణ ( కాంగ్రెస్ )

👉 9  వార్డు వీరవేణి నాగలక్ష్మి ( కాంగ్రెస్ )

👉  10  వార్డ్ – సంగి ఆనంద్(కాంగ్రెస్)

👉 11  వార్డు జక్కు పద్మ (కాంగ్రెస్)


👉12  వార్డు చుక్క సంధ్య (కాంగ్రెస్)

👉 13  వార్డ్ – చిపిరిశెట్టి రాజేష్ (కాంగ్రెస్)

👉 14  వార్డు  వేముల రమాదేవి ( కాంగ్రెస్ )

👉 15  వార్డు ఒజ్జెల లక్ష్మణ్ ( కాంగ్రెస్ )

👉 విజయం సాధించిన అత్తా కోడళ్ళు !


ధర్మపురి మున్సిపాలిటీలో 5 వ వార్డు నుంచి వేముల నాగలక్ష్మి ( కోడలు) 14 వార్డు నుంచి వేముల రమాదేవి ( అత్త ) కాంగ్రెస్ టికెట్ పై  ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులతో  పోటీపడ్డారు. అత్తా కోడలు ఇద్దరు కౌన్సిలర్లుగా విజయం సాధించారు.