👉 వెన్నముద్దల గండీలో…
J.SURENDER KUMAR,
గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ మల్లికార్జున స్వామి గొల్ల కేతమ్మ జాతర ఉత్సవాలు మంగళవారం రాత్రి ముగిశాయి.. బీర్పూర్ మండలం రంగసాగర్ గ్రామపంచాయతీ పరిధి దట్టమైన అడవి ప్రాంతం వెన్నెముద్దుల గండి వద్దా స్వయంభుగా వెలసిన శ్రీ మల్లిఖార్జున స్వామీ గొల్లకేతమ్మ, జాతర ఉత్సవాలు గత ఆదివారం ఆరంభం అయ్యాయి..
యాదవ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో గొల్ల కేతమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఉత్సవాలు అనాదిగా యాదవ ఆచార ప్రకారం నిర్వహించారు.

మంగళవారం జాతర చివరి రోజు సందర్భంగా
అగ్నిగుండాలు, మల్లన్న పట్నాలు, ఎల్లమ్మ బోనాలు నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు ఈ జాతర ఉత్సవాలలో రంగసాగర్ గ్రామ సర్పంచ్ బోడ సాగర్, , ఉప సర్పంచ్, సంఘ గంగన్న ,మరియు వార్డు సభ్యులు, యాదవ సంఘం సభ్యులు, పరిసర గ్రామాల ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా సర్పంచ్ బోడ సాగర్ మాట్లాడుతూ …

తరతరాలుగా భక్తుల పాలిట కొంగు బంగారమయ్యి , కోరిన కోరికలు తీర్చే స్వయంభూః వెన్నముద్దల గండి మల్లిఖార్జున స్వామీ గొల్లకేతమ్మ జాతర లో భక్తులకు సేవలు అందించిన వారికి, యాదవ సంఘ సభ్యులకు స్వచ్ఛంద సేవకులకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.
