ధర్మపురి నరసింహుడి హుండీ ఆదాయం అరకోటి !

J.SURENDER KUMAR,

ధర్మపురి  శ్రీలక్ష్మీనరసింహస్వామి హుండీ  ఆదాయం ₹ 51,20,748/- లభించిందని ఆలయ కార్య నిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.   (12-01-2025 నుండి 10-03-2026 )   వరకు 58  రోజుల హుండీ నీ  మంగళవారం లెక్కించగా మిశ్రమ బంగారము 30 గ్రాములు, మిశ్రమ వెండి 4 కిలోల 100 గ్రాములు మరియు విదేశీ నొట్లు 17 వచ్చాయని తెలిపారు.

హుండీ లెక్కింపు కార్యక్రమములో దేవాదాయ శాఖ  సహాయ కమీషనర్, నాయన సుప్రియ,  దేవస్థాన అధ్యక్షులు జక్కు రవీందర్, ధర్మకర్తలు స్వచ్ఛంద సంస్థలు ఉద్యోగులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు