సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,


భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్  గౌరవార్థం శనివారం ఏర్పాటు చేసిన విందుకు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జస్టిస్ సూర్యకాంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

శంషాబాద్ లోని హోటల్ నోవాటెల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విందు ఏర్పాటు చేశారు. విందులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ , ఇతర న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు సీనియర్ సిటిజన్ లు హాజరయ్యారు.