వ్యవసాయ మార్కెట్  ఆదాయంలో ధర్మపురి టాప్ !

👉 అభినందించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

2025-26 ఆర్ధిక సంవత్సరంలో ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదాయం ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం అధిగమించి జగిత్యాల జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మంగళవారం ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్, చిలుముల లావణ్య లక్ష్మణ్ తో పాటు పాలకవర్గాన్ని, కార్యదర్శిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘన బట్ల దినేష్  తదితర నాయకులు ఉన్నారు.

వ్యవసాయ మార్కెటింగ్ శాఖా ధర్మపురి మార్కెట్ కు  ₹ 239.49 లక్షల పి వసూలు  టార్గెట్  నిర్ణయించారు. ధర్మపురి మార్కెట్ యంత్రాంగం ₹ 382.46 లక్షలు మార్కెట్ ఫీజు వసూలు చేసి జగిత్యాల జిల్లాలో మొదటి స్థానములో నిలిచింది.

👉 మార్కెట్ అభివృద్ధికి ₹ 1.60 లక్షల నిధులు !

ధర్మపురి  వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ₹ 1.60 లక్షల నిధులు విడుదల చేశారు.

మార్కెట్ కమిటి పరిధిలోని దుబ్బాల గూడెంలోని  నాబార్డ్ గోదాము చుట్టూ ప్రహరి గోడ నిర్మాణము, మరియు మార్కెట్ యార్డు లోచైర్మన్ ఛాంబర్, సి.సి వర్క్ నిర్మాణమునకు నిధులు మంజూరి చేస్తూ  ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రిని మార్కెట్ కమిటి చైర్ పర్సన్  చిలుముల లావణ్య లక్ష్మణ్ , వైస్ చైర్మన్  సంగ నర్సింహులు , సభ్యులు శ్రీమతి వాంకుదోత్ గీతాంజలి , గంధం రాజయ్య , కాశెట్టి రాజు,  గునిశెట్టి అంజయ్య , మార్కెట్ కమిటి కార్యదర్శి డి. శ్రీనివాస్ రావులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

.