గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు ! విజ్ఞాన కేంద్రాలు

నిరంతర పుస్తక పఠనం తో జ్ఞానం పొందుతారు!

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ !

(J. Surender Kumar)

జగిత్యాల జిల్లా గ్రంథాలయంలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మున్సిపల్  చైర్ పర్సన్  భోగ శ్రావణి లు పాల్గొన్నారు.  వివిధ విభాగాల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వారు బహుమతులు అందజేశారు.

ఎమ్మేల్యే మాట్లాడుతూ …
జగిత్యాల జిల్లా కేంద్రం లో 2 కోట్లతో నూతన గ్రంథాలయం నిర్మాణం చేపట్టడం జరిగింది అని, త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. .గ్రంధాలయం ఒక దేవాలయం వంటిది అని అన్నారు ..రాయడం, చదవడం ద్వారా నే ఎక్కువ కాలం గుర్తు చేసుకునే అవకాశం ఉందని, విద్యార్థులు వాటిని పాటించాలని సూచించారు.  ప్రతి విషయాన్ని ప్రశ్నించడం ద్వారా నే కొంత నేర్చుకునే అవకాశం ఉంటుంది అని,ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని అన్నారు.

మరియు హైకోర్టు మాజీ న్యాయమూర్తి  ప్రకాష్ రావు , గ్రంధాలయానికి పుస్తకాలు  జగిత్యాల ఎమ్మెల్యే  అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే  ,హైకోర్ట్ మాజీ న్యాయమూర్తులు ఇరువురి సమక్షంలో లైబ్రేరియన్  గ్రంధాలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి ప్రకాష్ రావు  ,జగిత్యాల జిల్లా జడ్జి జితేందర్  ,కార్యదర్శి సరిత, ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, సర్పంచ్ లు సత్తమ్మా గంగారాం, తిరుపతి, ఎంపీటీసీ సురేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ గంగాదర్, టీచర్స్ తరంగిణి అనిత , చందన ,మరియు విజయలక్ష్మి , నాయకులు  అద్యపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

23 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్స!

పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యం లో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 23 మంది కి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేశారు.
ఈ కార్యక్రమంలో  డా.విజయ్,  కౌన్సిలర్  కూతురు రాజేష్, సర్పంచ్ నారాయణ, ప్రభాకర్, రాయికల్ సర్పంచుల ఫోరం శ్రీనివాస్, రైతు బందు సమితి రాయికల్ మండలం కన్వీనర్ మోహన్ రావు,  రమేష్,  మనోహర్ రావు, దాసు,.పట్టణ ఎస్టీ సెల్  శ్రీరామ్ బిక్షపతి, జగిత్యాల అర్బన్ మండల అధ్యక్షులు శేకర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.