జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ !
J. SURENDER KUMAR,
ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లో పరిధిలో పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖ సంయుక్తంగా కలిసి సీడ్స్, ఫర్టిలైజర్ షాప్స్ ను సోమవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి షాప్స్ లో ఏమైనా నకిలీ విత్తనాలు ఉన్నాయని ఆరా తీశారు. సరైన ధ్రువపత్రాలు కలిగి ఉన్నారా ? లేదా ? అని బిల్ బుక్స్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అదికారులు మాట్లాడుతూ… ఆరుగాలం కష్టపడి రైతులు వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తుంటారు, వారికి నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు అమ్మి మోసం చేస్తే షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

నకిలీ విత్తనాలు అమ్మి పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు విత్తనాలు అమ్మే సమయంలో ప్రతి ఒక్కరూ రిసిప్ట్ ఇవ్వాలని సూచించారు. అలాగే రైతులు కూడా విత్తనాలు ఎరువులు కొనేముందు తప్పకుండా రసీదు తీసుకోవాలని పంట పండేంతవరకు రసీదులను జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. రైతులు విత్తనాలు కొనేముందు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకొని విత్తనాలు కొనాలని తెలిపారు. మండలంలో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని వారి వివరాలను గోప్యంగా ఉంచి ఆలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ తనిఖీలలో వ్యవసాయ అధికారులు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.