J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ యమధర్మరాజు స్వామివారికి, బుధవారం అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి.
”భరణి” నక్షత్రంను పురస్కరించుకుని శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తం తో అబిషేకం , ఆయుష్షు హోమం హరతి మంత్రపుష్పం కార్యక్రమాలు వేద పండితులు అర్చకులు అత్యంత వైభవంగా చేశారు.

దేవస్థాన వేదపండితులు ముత్యాల శర్మ , అర్చకులు ప్రదీప్ కుమార్ , నేరెళ్ల సంతోష్ కుమార్, బొజ్జా సంతోష్ కుమార్ , సంపత్ కుమార్, మరియు సిబ్బంది, భక్తులు. తదితరులు పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు.