దేవుళ్లకు నాసిరకం నైవేద్యం – భక్తులకు ప్రసాదాలు!


J.SURENDER KUMAR,


రాష్ట్రం లో ప్రముఖ ఆలయాలలో దేవుళ్లకు నాసిరకం

సరుకుల తో నైవేద్యాలు, భక్తులకు  ప్రసాదాలు అందుతున్న

దుర్భర దుస్థితి ఉందనే విషయం జగమెరిగిన సత్యం.


👉ఆలయాలకు సరుకులు కొనుగోలు తీరు తెన్నులు పరిశీలిస్తే …

సరుకులు సరఫరాకు ప్రముఖ ఆలయాల కార్య నిర్వహణాధికారులు తమ తమ ఆలయాల కు సంవత్సరం కాలం పాటు సరుకులు సరఫరాకు జనవరి ఫిబ్రవరి నెలలో పత్రికలలో ఆన్ లైన్ టెండర్ ప్రకటన జారీ చేస్తారు.
తమ ఆలయాలకు సరఫరా చేయాల్సిన  బ్రాండెడ్ సరుకుల వివరాలు టెండర్ ప్రకటనలో ముందస్తుగా పేర్కొంటారు.

👉 కొన్ని ఇవి ….

1). ఖజు (JH బ్రాండ్ రెండు పీసులు కలపి ఉన్నది ) 2) కారం పొడి ( ఆశీర్వా ద్ బ్రాండ్ ) 3) పసుపు (స్వస్తిక్ బ్రాండ్) 4) ఉప్పు (అన్నపూర్ణ బ్రాండ్) 5) గోధుమపిండి (అన్నపూర్ణ బ్రాండ్) 6) టీ పొడి (జెమినీ బ్రాండ్) 7) హారతి కర్పూరం (స్వస్తిక్ బ్రాండ్) 8) తేనె (నెంబర్ వన్ గిరిజన బ్రాండ్) 9) నూనె (గోల్డ్ డ్రాప్ బ్రాండెడ్) 10) కుంకుమ (నోము బ్రాండెడ్) 11) అగర్బత్తులు ( పద్మిని బ్రాండెడ్ ) 12) పంచదార  (బోధన్ లేదా. గాయత్రి బ్రాండెడ్) 13) శనగపప్పు ( క్యామెల్ బ్రాండ్ ) 14) బియ్యం ( ఓల్డ్ బిపిటి బ్రాండ్ ) 15) చీపురు (బొంబాయి బ్రాండ్ ).16) బ్లీచింగ్ పౌడర్ ( శ్రీకృష్ణ కంపెనీ బ్రాండ్ ) 17) యాసిడ్ ( MEPL బ్రాండ్ ) 18 ) సెంటెడ్ ఫినాయిల్ ( Pedilite Mr .Perfect బ్రాండెడ్ ) లతో పాటు విద్యుత్ పరికరాలు( ఫిలిప్స్ కంపెనీ, నాకొడ బ్రాండ్ వైర్లు) కలుపుకొని దాదాపు 100 కు పైగా వస్తువులు ఆయా కంపెనీల బ్రాండ్ లు పేర్కొంటూ సరుకుల సరఫరా చేయాలని ప్రస్తుత మార్కెట్ ధరలను పేర్కొంటూ సంవత్సర కాలం పాటు  టెండర్ లో పేర్కొన్న ధరలకు సరుకులు పంపిణీ చేయాలని టెండర్ నిబంధన.

👉ఆలయ ఆదాయ దోపిడి ఇలా…..

ఆలయంలో స్వామివారి నివేదనకు భక్తుల ప్రసాదాల అమ్మకాల కోసం నెల రోజులకు సరిపడు సరుకుల వివరాలు పేర్కొంటూ ఆలయ కార్యనిర్మాణాధికారి కొనుగోలు చేస్తారు. సరుకుల సరఫరా టెండర్ దారుడికి ఈ మెయిల్, లేదా వాట్సప్ లో సరుకుల వివరాలు క్వాంటిటీ, లిస్టు పంపిస్తారు.  హైదరాబాదు నుండి ఆలయ గోదాములలోకి చేరిన సరుకుల నాణ్యత ప్రమాణాలు పరిశీలించే వారు ఉండరు. కేవలం దిట్టం (సరుకుల వినియోగం) నిర్వహించే ఉద్యోగి,. కార్య నిర్వహణాధికారికి, సరుకులను సరఫరా చేసే టెండర్దారుడికి మాత్రమే  సరుకుల నాణ్యత ప్రమాణాలు, క్వాంటిటీ తెలిసే అవకాశం ఉంది. ఈ ముగ్గురి కే లావాదేవీలు, సరుకుల వివరాలు సమాచారం ఉంటుంది.

👉నాసిరకం సరుకుల సరఫరా, ధరలలో భారీ వ్యత్యాసం  వినియోగం తీరు ఇలా ….

ఉదాహరణకు, టెండర్ లో, గోల్డ్ డ్రాప్ ఆయిల్ పేర్కొంటారు, దాని స్థానంలో  పామాయిల్ లేదా, మామూలు నూనె,  ఆలయానికి కొనుగోలు చేస్తారు. ( గోల్డ్ డ్రాప్ నూనెకు, మామూలు నూనెకు మధ్య వ్యత్యాసం కిలోకు దాదాపు వంద రూపాయలకు పైగా ఉంటుంది, కొనుగోలు చేసింది గోల్డ్ డ్రాప్ ఆయిల్ అంటూ రికార్డులో పేర్కొంటారు) ఖాజు J.H బ్రాండ్ , రెండు పీసులు కలిపి ఉన్న ఖాజూ  సరఫరా చేయాలి దానికి బదులు   ఖాజూ పలుకులు, టెండర్ దారుడు సరఫరా చేస్తారు. ( కిలో ఒక్కంటికి దాదాపు ₹300 నుంచి ₹400 రూపాయల ధర వ్యత్యాసం ఉంటుంది )  యాలకులు, ఆకుపచ్చ నెంబర్ వన్ కు బదులు సెకండ్ క్వాలిటీ, పసుపు, స్వస్తిక్ బ్రాండ్ కు బదులు సెకండ్ క్వాలిటీ. తదితర నాసిరకం సరుకులు సప్లై దారుడు చేస్తాడు.( ఆలయ ఆదాయం నుండి బ్రాండెడ్ సరుకుల ధర చొప్పున డబ్బులు చెల్లించినట్టు రికార్డులలో నమోదు చేస్తారు )  స్వామివారికి నైవేద్యం, భక్తులకు ప్రసాదాల, ఉచిత అన్నదానం కోసం. ఈ సరుకులనే వినియోగిస్తారు. ( ప్రతినెల దాదాపు ₹ 25 లక్షల నుంచి ₹30 లక్షల రూపాయల సరుకులను ఒక్క ధర్మపురి దేవస్థానం వారు కొనుగోలు చేస్తారు )
సరుకుల సప్లై దారుడి కి మాత్రం బ్రాండెడ్ సరుకుల కొనుగోలు ధరలు చెల్లిస్తూ, కొందరు అధికారులు సప్లైదారు నుంచి నెల నెల లక్షలాది రూపాయల  కమిషన్ తీసుకుంటారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ లెక్కన ప్రతినెల ఒక్కొక్క ఆలయం కనీసం ₹ 5 లక్షల  నుండి ₹10 లక్షల రూపాయల మేర బ్రాండెడ్ సరుకులు కొనుగోలు చేసినట్టు సప్లైదారుడికి, వాటి ధరల ఆధారంగా డబ్బులు చెల్లిస్తుంటారు. దీంతో ఆలయ ఆదాయానికి భారీ గా గండి పడుతుందనే ఆరోపణలు  ఉన్నాయి.

👉 స్వామివారికి నైవేద్యం, ఉచిత అన్నదానం ప్రసాదాల తయారీలో చేతివాటం !

దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు లడ్డు, పులిహోర ప్రసాదాల తయారీలో నాణ్యత ప్రమాణాల గల సరుకుల వినియోగించాల్సిన ఉండగా బిపిటి (పాతవి సన్నవి) బియ్యం స్థానంలో కొత్తవి దొడ్డువి, స్వామి వారికి భక్తులు సమర్పించిన బియ్యం  వినియోగిస్తారని ఆరోపణలు ఉన్నాయి.

👉 100 కిలోల శనగపిండితో లడ్డు తయారీలో వాడాల్సిన సరుకులు !

100 కిలోల శనగపిండి, 2 క్వింటాళ్ల పంచదార, 5 కిలో మిస్రీ
5 కిలో కిస్మిస్, 7.500 కిలో ఖాజు, (డబుల్ సైజు) 75 కిలోల బ్రాండెడ్ నెయ్యి, 1 కిలోల యాలకుల పొడి, 100 గ్రాములు జాజికాయ, 100 గ్రాముల పచ్చ కర్పూరం. వినియోగించాల్సి ఉంటుంది.
వీటి తయారీకి నిబంధనల మేరకు రెండు గ్యాస్ సిలిండర్లు వినియోగించాల్సి ఉంటుంది.

👉.పులిహోర 100 కిలోల తయారీకి !

100 కిలోల బిపిటి పాత బియ్యం, 5 కిలో శనగపప్పు, అర్ధ కిలో మినప్పప్పు, 5 కిలో పల్లీలు, 0.500 గ్రాముల పసుపు, 20 కిలోల నూనె, 20 కిలోల చింతపండు, 1 కిలో  ఎండుమిర్చి, కిలో ఉప్పు, 100 గ్రాముల జిలకర, 1 కిలోలఆవాలు, 0.50 గ్రాముల మెంతులు, 1 కిలో  మిరియాలు, 0.040 గ్రాముల ఇంగువ, వినియోగించాల్సి ఉంటుంది.

👉.ప్రసాదం లడ్డు బరువు ,80 గ్రాములు. పులిహోర ప్యాకెట్ 200 గ్రాములు ఉండాలి !

👉నిఘా ,నియంత్రణ, ఉండదు !

ప్రతినెల సరుకులు ఆలయానికి వచ్చిన సందర్భంలో వాటి నాణ్యత ప్రమాణాలు, ఎంత మొత్తంలో వచ్చిందనే నిఘా ఉండదు, ( కేవలం ఆలయ కార్య నిర్వాహ అధికారి,  దిట్టం (సరుకుల) నిర్వాహకుడికి మాత్రమే తెలిసి ఉంటుంది. నిబంధనలో మాత్రం సరుకుల నిల్వలను, ప్రసాదాలను ఫుడ్ ఇన్స్పెక్టర్ , కల్తీ నిరోధక శాఖ అధికారులు గాని తనిఖీ చేయాలనే నిబంధనలు ఉన్నాయి.
సరుకులు కొనుగోలు, వినియోగం వివరాలు ప్రతిరోజు రిజిస్టర్ లో నమోదు చేయాల్సి ఉంటుంది.15 రోజులకు ఓసారి ఆలయ కార్యనిర్వాణాధికారి సరుకుల నిలువలు రికార్డులను పరిశీలించి సంతకాలు పెట్టాల్సి ఉంటుంది.


(మరో కథనంలో.. సామాన్య  వ్యాపారుడి కి టెండర్ లో పాల్గొనడానికి అర్హత లేని  నిబంధనలు )