👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ దేశ రాజకీయాల్లో విశిష్ట నాయకుడిగా, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా నిలిచారని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
అన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ధర్మపురి లో సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….

బాబు జగ్జీవన్ రామ్ దేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, సమాన హక్కుల సాధన కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సామాజిక సమానత్వం, అభివృద్ధి దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
