J.SURENDER KUMAR,
అనారోగ్యంతో హైటెక్ సిటీలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి గారి వెంట ఎంపీ వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు.
👉 వివాహ వేడుకలలో సీఎం..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాజేంద్రనగర్లోని మల్లికా గార్డెన్స్లో షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ మేనకోడలు రాణి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ మల్లు రవి పాల్గొన్నారు.
