👉 రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో !
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి నిర్ణయించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేదపండితులు, సిద్ధాంతులు నిర్ణయించిన ముహూర్తం మేరకు ఈ నెల 10 న నాగార్జున సాగర్లో వరుణ యాగం నిర్వహించనున్నారు.
👉 నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో యాగం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేదపండితులు, నిర్ణయించిన ముహూర్తంలో యాగ క్రతువులను నిర్వహిస్తారు.

👉 కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకళ సంతరించుకోవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలన్న సంకల్పంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సారథ్యంలో వరుణ యాగం జరుగుతుంది. యాగం అనంతరం మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది వేద పండితులు, 11 హోమ గుండాల మధ్య శాస్త్రోక్తంగా యాగం నిర్వహించనున్నారు.
