వెయ్యి రోజులు ధర్మపురి అభివృద్ధికి దారులు !

👉 ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రశాంతంగా ప్రజలు !

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ప్రజా ప్రభుత్వ పాలనలో ధర్మపురి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమం వైపు వేగంగా అడుగులు వేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ, విద్య, వైద్యం, మౌలిక వసతులు, రవాణా, సంక్షేమ రంగాల్లో అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధిగా వెయ్యి రోజుల పాలనలో నియోజకవర్గానికి తీసుకొచ్చిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు.


👉 ఎల్లంపల్లి ముంపు బాధితులకు ₹ 18 కోట్ల పరిహారం !


గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న చెరువుల ముంపు బాధితుల సమస్యపై మంత్రి ప్రత్యేక చొరవ చూపి ₹18 కోట్ల పరిహారం మంజూరుకు కృషి. దీంతో దీర్ఘకాలంగా పరిహారం కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.

👉విద్యకు పెద్దపీట మూతపడిన నైట్ కాలేజీ పునఃప్రారంభం !

గత ప్రభుత్వ హయాంలో మూతపడిన నైట్ కాలేజీని తిరిగి ప్రారంభించి విద్యార్థులకు విద్యా అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ధర్మపురి నియోజకవర్గంలో విద్యా మౌలిక వసతులను బలోపేతం చేసే దిశగా పలు చర్యలు చేపట్టారు. ధర్మపురి నియోజకవర్గానికి ₹200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయించడంతో పాటు, గోల్లపల్లి మండలంలో ₹ 17 కోట్లతో బాలుర గురుకుల పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ధర్మపురి డిగ్రీ కళాశాలకు ₹10 లక్షలు, కస్తూరిబా గాంధీ హాస్టల్ నిర్మాణానికి ₹ 48 లక్షలు, గోల్లపల్లి మండలంలో కస్తూరిబా గాంధీ హాస్టల్ నిర్మాణానికి ₹.52 లక్షలు మంజూరయ్యాయి.

👉 రెవెన్యూ సమస్యకు పరిష్కారం !

గాదేపల్లి రెవెన్యూ శివారులో పట్టాలు ఉన్నప్పటికీ భూములకు హద్దులు చూపక ఇబ్బందులు పడుతున్న 87 మంది భూ యజమానులకు హద్దులు చూపించి, సంబంధిత పత్రాలను అందజేశారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించారు.

👉 మండల కేంద్రాల్లో మౌలిక వసతులు…

బుగ్గారం మండల కేంద్రంలో నూతన MPDO, MRO కార్యాలయాలు, PHC నిర్మాణానికి ₹ 4 కోట్లు మంజూరు చేయించారు. ధర్మారం మండలంలో ఐటీఐ కళాశాల మంజూరు చేయించి భూమిపూజ నిర్వహించారు.

👉 వైద్య రంగంలో ప్రత్యేక శ్రద్ధ!

అత్యవసర వైద్య సేవలు ప్రజలకు వేగంగా అందేలా వెల్గటూర్, బుగ్గారం మండలాలకు 108 అంబులెన్సులు మంజూరు చేయించారు. నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఇప్పటివరకు 7,263 చెక్కులకు ₹ 207.35 కోట్ల మేరకు ఆర్థిక సహాయం అందినట్లు తెలిపారు. అలాగే ధర్మపురి గోదావరి శిఖరేజ్ ప్లాంట్ కోసం ₹17 కోట్లు మంజూరు చేయించారు.

👉 పత్తిపాక రిజర్వాయర్‌కు ₹500 కోట్ల బడ్జెట్ కేటాయింపునకు కృషి !

ధర్మారం మండలం పత్తిపాక రిజర్వాయర్‌కు మంజూరు చేయించడంతో పాటు, ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ.500 కోట్ల నిధులు కేటాయించేలా కృషి చేశారు.

👉 పేదలకు, మహిళలకు అండగా సంక్షేమం !

నియోజకవర్గంలో అనారోగ్య బాధితులకు ₹.7.50 కోట్లకు పైగా విలువైన 410 LOCలు అందించారు. స్వయం సహాయక సంఘాలకు ₹.4.18 కోట్ల వడ్డీలేని రుణాలు మంజూరు చేయించారు.

👉NRI పాలసీ.

విదేశాల్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఆరు కుటుంబాలకు NRI పాలసీ కింద ఒక్కో కుటుంబానికి ₹.5 లక్షల చొప్పున మొత్తం ₹30 లక్షల ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు.

👉 ఇందిరమ్మ కాలనీ లబ్ధిదారులకు యాజమాన్య గుర్తింపు!

ధర్మపురి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన 115 మంది లబ్ధిదారులకు ఇంటి నంబర్లు కేటాయించి, ఓనర్‌షిప్ స్లిప్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.

👉 రవాణా సౌకర్యాల మెరుగుదల !

ప్రయాణికుల సౌకర్యార్థం ధర్మపురి నుంచి హైదరాబాద్‌కు రాత్రి 11 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ప్రారంభించారు. దీంతో రాత్రి వేళల్లో హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలిగింది.


👉 మున్సిపాలిటీ అభివృద్ధికి ₹ 15 కోట్లు !

ధర్మపురి మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం TUFIDC నిధుల నుంచి ₹15 కోట్లు మంజూరు చేయించారు. విద్యుత్ స్తంభాల మరమ్మతులు, ఇతర మౌలిక వసతుల కోసం కూడా నిధులు కేటాయించారు.


👉 ఆధ్యాత్మిక రంగంలోనూ ఉద్యోగులకు ఊరట!

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని పురోహితులు ఎనిమిది మందికి జీతాలను ₹ 20 వేల నుంచి ₹ 30 వేలకు పెంచడంతో పాటు, దేవస్థానంలో పనిచేసే 15 మంది సిబ్బంది వేతనాలను ₹ 8 వేల నుంచి ₹12 వేలకు పెంచారు.


👉 అభివృద్ధే లక్ష్యం.. సంక్షేమమే ధ్యేయం !

ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమమే ధ్యేయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని మంత్రి తెలిపారు.

వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ధర్మపురి నియోజకవర్గంలో ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి పేర్కొన్నారు.