సాయి చరణ్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఫార్మా కంపెనీలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆరుగురు కార్మికుల ప్రాణాలు కాపాడిన సాయిచరణ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

తల్లిదండ్రుల తో కలిసి సాయి చరణ్ ఆదివారం సీఎంను కలిశారు. కార్మికులను కాపాడటంలో ప్రదర్శించిన తెగింపు వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. బాలుడి ధైర్య సాహసాలకు ముగ్ధుడైన సీఎం పుష్పగుచ్చం అందించి అభినందించారు.