కళ్లెంరెడ్డి పల్లె సమస్యలు పరిష్కరిస్తా మంత్రి లక్ష్మణ్ కుమార్ !

👉 కళ్లెం రెడ్డి పల్లెను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తా.!
‌‌

  J SURENDER KUMAR,

పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పాలకులు కళ్లెం రెడ్డిపల్లి వైపు కన్నెత్తి చూడలేదని  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం మండలం కమ్మర్ ఖాన్ పేట పంచాయతీ పరిధిలోని కళ్లెం రెడ్డి పల్లెలోని సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని  మంత్రి  అన్నారు.

ఆదివారం కల్లెం రెడ్డిపల్లి లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలను గ్రామస్తులు మంత్రి  దృష్టి తీసుకువెళ్లారు. సమస్యలపై స్పందించిన మంత్రి గ్రామంలోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.


👉 గ్రామంలోని కరెంట్ సమస్యను పెద్దపల్లి, కరీంనగర్ రెండు జిల్లాల విద్యుత్ అధికారులు కలిసి పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.


👉 గ్రామంలో కొత్త రేషన్ రేషన్ దుకాణం ఏర్పాటు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మూడు పంచాయతీల పరిధిలో ఉన్న కళ్ళెం రెడ్డి పల్లి ని ఒకే గ్రామ పంచాయతీగా చేసి స్వయం పాలన చేసుకునే విధంగా కృషి చేస్తానని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.


👉 గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు గత ప్రభుత్వంలో కల్లం రెడ్డి పల్లెను పట్టించుకోలేదని  రేవంత్ రెడ్డి నాయకత్వం లోని ప్రజాపాలనలో కళ్లెం రెడ్డి పల్లి సమస్యలను పరిష్కరించి గ్రామస్తులకు సంక్షేమ పథకాలు అందజేస్తామని మంత్రి  గ్రామస్తులకు హామీ ఇచ్చారు.