J SURENDER KUMAR,
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముఖ్యమైన 22 A, పరిపాలనా నిర్ణయాలపై చర్చించేందుకు మంగళవారం తన కేబినెట్ మంత్రులతో ఒక కీలక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నిషేధిత ఆస్తి జాబితాలు మరియు భూమి రిజిస్ట్రేషన్లకు సంబంధించిన 22A భూ సమస్య ఈ సమావేశం ప్రధానాంశం.
మంత్రులు, అధికారులు విధానాల అమలు, పెండింగ్లో ఉన్న రాష్ట్ర ప్రాజెక్టులు, ఇటీవలి రాజకీయ పరిణామాలను సమీక్షించనున్నారు భూ సంబంధిత ఫిర్యాదులు మరియు పరిపాలనా మార్గదర్శకాలపై మంత్రివర్గం తుది నిర్ణయాలు తీసుకుని బుధవారం అసెంబ్లీలో 22A భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వివరాలు, అక్రమాలకు పాల్పడిన వారిపై విచారణ కు ప్రకటన చేయనున్నట్టు చర్చ .
