మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరు లక్ష్మణ్ కుమార్, శనివారం రాఘవపట్నం మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

గొల్లపెల్లి మండలం రాఘవపట్నం మాజీ సర్పంచ్ తండ్రి కాసారపు రాజలింగం మృతి చెందారు ఆయన మృతదేహాన్ని ఎమ్మెల్యే సందర్శించి నివాళులు అర్పించారు.


👉లోత్తునూర్ లో….


గొల్లపెల్లి మండలం లోత్తునూర్ గ్రామానికి చెందిన కాళ్ల రాకేష్ ఇటీవల ధర్మపురి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ రాకేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి రాకేష్ కుటుంబానికి ₹ 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు


👉శేకెళ్ళలో….


బుగ్గారం మండలం శేకెళ్ళ గ్రామానికి చెందిన బంక లవన్ ఇటీవల గొల్లపెల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందరు. లవన్ కుటుంబా సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు.


👉ఇశ్రాజ్ పల్లె లో….
1


గొల్లపెల్లి మండలం ఇశ్రాజ్ పల్లె గ్రామానికి చెందిన సంకటి చంద్ర శేఖర్ యాదవ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందరు. చంద్ర శేఖర్ యాదవ్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ఓదార్చారు
.

  1. ↩︎