జీవన్ రెడ్డిని ఎంపీగా భారీ ఓట్లతో గెలిపించాలి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు అందరు కలిసి పనిచేయాలని, నిజామాబాద్ ఎంపీ గా జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలిపారు.


జగిత్యాల పట్టణం లో ఇందిరభవన్ లో శనివారం రోజున జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మన్ కుమార్ పాల్గొన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయండి – ధర్మపురి ఎమ్మెల్యే!


ధర్మపురి నియోజకవర్గం ఎండపెల్లి మండలం రాజారాం పల్లె లో మే నెల 3న జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభకు సంబందించిన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే అల్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం ఏర్పాట్లు పర్యవేక్షించారు.


సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..


పెద్దపెల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్మపురి నియోజక వర్గం రాజరాంపల్లిలో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారెంటీలను అమలు చేశామన్నారు. రెండు గ్యారెంటీలను కూడా త్వరలోనే అమలు చేస్తామని, గృహ లక్ష్మి పథకం కింద మన నియోజకవర్గానికి 3500ల ఇల్లు మంజూరు చేసినట్టు తెలిపారు.

ఎన్నికల కోడ్ అనంతరం వాటిని అర్హులైన ప్రతి పేదవారికి అందజేస్తామని, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ పైన అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెలో ఉండాలి అని రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీని ఉద్దేశించి మాట్లాడం జరిగిందని, ధర్మపురి నియోజకవర్గానికి నీళ్లు దక్కకుండా చేసిందే హరీష్ రావు అని, కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్నప్పుడు ధర్మపురి చేసిన అభివృద్ధి ఏమీ లేదని, బీజేపీ పార్టీ తరఫున ఉన్న అభ్యర్థి ఎవరో కూడా ప్రజానీకానికి తెలీదని, ప్రజా కుటుంబం నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు.