హరీష్ రావు ఆరోపణలు అన్ని అబద్ధాలే !

👉 ₹ 200 కోట్లా..? ₹.2,000 కోట్లా..?  ₹ 3,000 కోట్లా.. కుంభకోణం జరిగిందా  ? ముందుగా బీఆర్ఎస్ నేతలే క్లారిటీ ఇవ్వాలి !

👉 హరీష్ రావు ఆరోపణలు నిరూపిస్తే ప్రజల సమక్షంలోనే మంత్రి పదవికి రాజీనామా చేస్తా !


👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  సవాల్ !

J.SURENDER KUMAR,

గురుకుల విద్యాసంస్థల కొనుగోళ్లకు సంబంధించిన టెండర్ల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేస్తున్న ఆరోపణలు అన్ని అబద్ధాలే,  పూర్తిగా నిరాధారమైనవని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అబద్ధాల ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 మంగళవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…

ఒకే అంశంపై బీఆర్ఎస్ నాయకులు మూడు రకాల అంకెలు చెబుతున్నారని విమర్శించారు. హరీష్ రావు ₹ 2,000 కోట్ల కుంభకోణమని చెబుతుండగా, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ₹ 3,000 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారని, మరోవైపు వారి అనుబంధ మీడియా సంస్థలు ₹ 200 కోట్ల వ్యవహారమని ప్రచారం చేస్తున్నాయని అన్నారు.

అసలు నిజమైన అంకె సంఖ్య ఏది .? ₹ 200 కోట్లా..? ₹ 2,000 కోట్లా..? ₹ 3,000 కోట్లా..? మీకే క్లారిటీ లేకపోతే ప్రజలు ఎలా నమ్మాలి?” అని  మంత్రి ప్రశ్నించారు.

హరీష్ రావు ఆరోపణలు నిజమని ఆధారాలతో నిరూపిస్తే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి ప్రజల సమక్షంలోనే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని  మంత్రి లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు.

👉 టెండర్లపై సీఎం సమీక్ష తర్వాతే నిర్ణయాలు !

టెండర్ల గురించి తనకు, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు తెలియదని ప్రచారం చేయడం పూర్తిగా అబద్ధమని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ముగ్గురు మంత్రులతో , అధికారులతో అలాగే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి సమీక్ష నిర్వహించిన అనంతరమే కొనుగోలు ప్రక్రియ చేపట్టామని తెలిపారు. “ఇది మంత్రులకు తెలియకుండా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కాదు. ప్రతి నిర్ణయం పారదర్శకంగా జరుగుతోంది” అని మంత్రి అడ్లురి పేర్కొన్నారు.

👉 హైకోర్టు కూడా టెండర్ విధానాన్ని సమర్థించింది !

కేంద్రీకృత కొనుగోలు విధానాన్ని వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, న్యాయస్థానం ఈ విధానాన్ని సమర్థించిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గుర్తు చేశారు. టెండర్లన్నీ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ద్వారా, సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించామని వెల్లడించారు.

👉 27 వస్తువులకు ఈ-టెండర్లు !

ఈ ఏడాది ఏప్రిల్ 2 న విద్యార్థులకు అవసరమైన 27 రకాల వస్తువుల కొనుగోలుకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు పిలిచినట్లు మంత్రి  తెలిపారు.

👉 వాటిలో:

@ యూనిఫాం క్లాత్ !

@ ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు!

@ ట్రంక్ బాక్సులు!

@ స్కూల్ బ్యాగులు!

@ బూట్లు, సాక్సులు!

@ బెడ్డింగ్ మెటీరియల్!

@ నోట్‌బుక్స్

@ స్టేషనరీ కిట్లు!

@ పీటీ డ్రెస్!

@ ట్రాక్ సూట్లు!

@ టైలు, బెల్టులు!

@ ఐడీ కార్డ్ హోల్డర్లు!
ఉన్నాయని  మంత్రి తెలిపారు

👉 బెడ్డింగ్ మెటీరియల్ టెండర్ వివరాలు

బెడ్ షీట్లు, కార్పెట్లు, బ్లాంకెట్లు, టవల్స్ కొనుగోలు కోసం వచ్చిన టెండర్లలో పోటీ ప్రక్రియ అనంతరం ధరలను తగ్గించినట్లు తెలిపారు.

@ బెడ్ షీట్ ధర ₹ 425 నుండి ₹ 405కు తగ్గింపు

@ కార్పెట్ ధర  ₹ 412 .

@ టవల్ ధరపై కూడా చర్చల అనంతరం తగ్గింపు

👉 మొత్తం:

@ బెడ్ షీట్లు – 3 లక్షలు

@ కార్పెట్లు – 2.29 లక్షలు

@ బ్లాంకెట్లు – 6.49 లక్షలు

@ టవల్స్ – 1,500
కొనుగోలు చేయనున్నట్లు మంత్రి.తెలిపారు.ఈమొత్తం కొనుగోలు విలువ ₹ 70.86 కోట్లు అని వెల్లడించారు.

👉 ట్రంక్ బాక్సుల కొనుగోలు !

ట్రంక్ బాక్సులకు ఐదు కంపెనీలు దరఖాస్తు చేశాయని తెలిపారు. పోటీ ప్రక్రియలో ధరలను చర్చల ద్వారా తగ్గించి:

@ ప్రారంభ ధర : రూ.1,299

@ చర్చల అనంతరం ఖరారు చేసిన ధర : ₹.1,275 గా నిర్ణయించామని చెప్పారు.

దీని మొత్తం విలువ ₹ 41.40 కోట్లు అని వెల్లడించారు.


👉 యూనిఫాం క్లాత్ !

యూనిఫాం క్లాత్ టెండర్లలో మూడు సంస్థలు పాల్గొన్నాయని తెలిపారు. మొత్తం వర్క్ ఆర్డర్ విలువ
₹ 298.10 కోట్లు.

👉 ప్రభుత్వ రంగ సంస్థ TGSCO కు 60 లక్షల మీటర్ల వస్త్ర సరఫరా బాధ్యత అప్పగించామని తెలిపారు.

👉 దీని విలువ: ₹.57.17 కోట్లు అని వెల్లడించారు.!
ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు

👉 రెండు సంస్థలు అర్హత సాధించగా, తక్కువ ధర కోట్ చేసిన సంస్థకు టెండర్ కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

ఒక్కో సెట్ ధర: ₹.360 మొత్తం కొనుగోలు విలువ: ₹ 18.36 కోట్లు అన్నారు.

అధిక ధరలు వచ్చిన చోట టెండర్లు రద్దు
ప్రభుత్వం పారదర్శకతకు కట్టుబడి ఉందని చెబుతూ
@ నోట్‌బుక్ టెండర్‌ను రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించామని

@ స్టేషనరీ కిట్‌ను జిల్లా స్థాయిలో కొనుగోలు చేయాలని నిర్ణయించామని

@ ట్రాలీ బ్యాగ్ టెండర్‌ను రద్దు చేశామని

@ పీటీ డ్రెస్, ట్రాక్ సూట్ల టెండర్లను ఇంకా ఖరారు చేయలేదని వివరించారు.

👉 బీఆర్ఎస్ హయాంలో ఆలస్యాలు!

గత ప్రభుత్వంలో విద్యార్థులకు అవసరమైన వస్తువులు విద్యా సంవత్సరం ప్రారంభమైన అనేక నెలల తర్వాత అందేవని మంత్రి అడ్లూరి విమర్శించారు.

👉TRS / BRS హయంలో గురుకులాల్లో

@ యూనిఫాంలు అక్టోబర్‌లో
@ పుస్తకాలు, బెడ్ షీట్లు, ఇతర వస్తువులు సెప్టెంబర్‌లో అందించేవారని గుర్తు చేశారు.

👉 ఆధారాలు ఉంటే బయటపెట్టండి !

“వేల కోట్ల కుంభకోణం జరిగిందని చెబుతున్నారు. ఒక్క ఫైల్ చూపించండి. ఒక్క చెల్లింపు వివరాన్ని చూపించండి. ఒక్క ఆధారాన్ని ప్రజల ముందుంచండి.” అని మంత్రి అడ్లురి డిమాండ్ చేశారు.

👉 తెలంగాణ ప్రజలకు కావాల్సింది ప్రచార సంఖ్యలు కాదు. స్పష్టమైన ఆధారాలు.”

“విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేస్తున్న ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలి.”
“అబద్ధాలను పదిసార్లు చెప్పి నిజాలుగా మార్చే రాజకీయాలు మాకు తెలియవు. దోచుకోవడం, దాచుకోవడం మాకు తెలియదు. పారదర్శక పాలన మాత్రమే తెలుసు.”అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.