👉 కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో !
J.SURENDER KUMAR,
కర్ణాటకలోని హోస్పేట వద్ద ప్రతిష్టాత్మక తుంగభద్ర ప్రాజెక్టుకు నూతనంగా ఏర్పాటు చేసిన 33 క్రస్ట్ గేట్లను మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో ఘనంగా జరిగింది.
👉 ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం 33 క్రస్ట్ గేట్లను కొత్తగా ఏర్పాటు చేయగా, మీట నొక్కి 17వ గేటును సీఆర్ పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ , 19వ గేటును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , 20వ గేటును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
👉 2024 ఆగస్టులో సంభవించిన వరదల కారణంగా 19వ గేటు దెబ్బతినడంతో, నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రూ.51 కోట్ల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు.
👉 తుంగభద్ర జలాల సమర్థ నిర్వహణ, సాగు మరియు తాగునీటి అవసరాల భద్రతను మరింత బలోపేతం చేయడంలో ఈ గేట్ల పునరుద్ధరణ కీలక మైలురాయిగా నిలవనుంది.
