J.SURENDER KUMAR
మొహర్రం సందర్భంగా రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ధర్మపురిలో మొహర్రం వేడుకలు పాల్గొన్నారు. ఈసందర్భంగా పట్టణంలోని నంది చౌరస్తాలో పీరీలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా హిందూ, ముస్లీంలు సోదరభావంతో కలిసి పీర్ల పండుగ జరుపుకుంటారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్యా దేశంలో భవిష్యత్తు తరాల కోరకు ఇదే సంస్కృతిని కొనసాగించాలని మంత్రి కోరారు.
