సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J. SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా కోరుట్ల లో కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో మే మాసం 1న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు తో కలిసి శనివారం హెలిప్యాడ్ స్థలాన్ని, మీటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార రథాలను వారు జెండా ఊపి ప్రారంభించారు.


నిజామాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే ఒకటిన సీఎం రేవంత్ రెడ్డి కోరుట్లకు రానున్నారని, రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు నిజం షుగర్ కర్మాగారం తెరిపించేందుకు శ్రీధర్ బాబు నేతృత్వంలో ఇప్పటికే ఫ్యాక్టరిని సందర్శించడం జరిగింది అన్నారు.

ఇచ్చిన హామీ మేరకు చెక్కర ఫ్యాక్టరిని తెరిపిస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుట్ల పర్యటనకు జగిత్యాల జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.