మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

ధర్మపురి మండలం తుమ్మనాల గ్రామ మాజీ సర్పంచ్ శ్రీమతి శెకెల్ల సత్తమ్మ  కుటుంబ సభ్యులను బుధవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా  మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ  సర్పంచ్ గా సత్తమ్మ గ్రామానికి అందించిన సేవలను,  గుర్తు చేసుకున్నారు. మంత్రి వెంట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, గ్రామ సర్పంచ్ జగదీష్ తో పాటు నాయకులు వేముల రాజు, ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్ చీపిరి శేట్టి రాజేష్, మాజీ సర్పంచ్ మల్లేష్ తదితరులు ఉన్నారు.


👉 వివాహ వేడుకలకు…


కరీంనగర్ పట్టణంలో జరిగిన ధర్మారం మండల కేంద్ర జర్నలిస్ట్ తన్నీరు రాజేందర్, ప కుమారుడు రవిచంద్ర – మణి దర్శిని  వివాహ మహోత్సవానికి  సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.