మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మంగళవారం  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

👉 గొల్లపల్లి మండల ఉప సర్పంచ్ గురుజల బుచ్చిరెడ్డి  నానమ్మ గురుజల వెంకటమ్మ ఇటీవల మృతి చెందింది విషయం తెలుసుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్  నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

👉 జగిత్యాలకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంచాల రామేశం మరణించిన విషయం తెలుసుకుని మంత్రి లక్ష్మణ్ కుమార్,  స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రామేశం సేవలను  గుర్తు చేస్తూ ఆయన మరణం ఆధ్యాత్మిక రంగానికి మరియు సమాజానికి తీరని లోటని మంత్రి  అన్నారు.

👉 వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామానికి చెందిన కట్టేం తిరుపతి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు.   మంత్రి  లక్ష్మణ్ కుమార్, వారి  కుటుంబ సభ్యులను పరమర్శించి  ప్రభుత్వం మరియు పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
.